పార్సీ ప్రజలు

పార్సి లేదా పార్సీ (pronounced /ˈpɑrsiː/) అనే పదం రెండు జొరాస్ట్రియన్ సమాజాలలో పెద్దదాని యొక్క లేదా భారత ఉపఖండం నుండి వచ్చిన సభ్యుడిని సూచిస్తుంది.

సాంప్రదాయం ప్రకారం, నేటి పార్సీలు ఇరానియన్ జొరాస్ట్రియన్ల సమూహం యొక్క వంశానికి చెందినవారు వారు క్రీస్తుశకం 10వ శతాబ్దంలో [1] ఇరాన్లో ముస్లింల పీడన వలన పశ్చిమ భారతదేశానికి వలస వచ్చారు.[2][3][4] ఈ ప్రాంతంలో దీర్ఘకాల ఉనికి పార్సీలను, ఇరానీయుల నుండి విభిన్నంగా ఉంచుతుంది, వారు ఇటీవలి కాలంలో వచ్చినవారు, మరియు రెండు భారతదేశ-జొరాస్ట్రియన్ సమాజాలలో చిన్నదానికి చెందినవారు.

నిర్వచనం మరియు గుర్తింపు

"పార్సీ" అనే పదం 17వ శతాబ్దం వరకు భారతదేశ జొరాస్ట్రియన్ గ్రంథాలలో ప్రస్తావించబడలేదు. ఆ కాలం వరకు, ఆ విధమైన గ్రంథాలు జార్తోష్టి, "జోరోస్ట్ర్యియన్" లేదా బెహ్దిన్, "మంచి స్వభావం[యొక్క]" లేదా "మంచిమతం [యొక్క]" అనే పదాలను స్థిరంగా ఉపయోగించాయి. 12వ శతాబ్దానికి చెంది, పార్సీలను పొగడుతూ ఒక హిందూచే రాయబడినట్లు కనబడుతున్న (పార్సీ ఇతిహాసం; cf. Paymaster 1954, p. 8 ఈ గ్రంథం జొరాస్ట్రియన్ మతాచార్యుడిదని దోషపూరితంగా పేర్కొంటుంది), ఒక సంస్కృత గ్రంథంలోని పదహారు శ్లోకాలు, ఈ పదాన్ని భారతదేశ జొరాస్ట్రియన్ల గుర్తింపు కొరకు ఉపయోగించిన మొదటి ధ్రువీకరణ.

ఐరోపా భాషలలో పార్సీలకు చెందిన మొదటి సూచన 1322కి చెందినది, ఒక ఫ్రెంచ్ సన్యాసి, జోర్డనాస్, తాన మరియు బ్రోచ్ లలో వారి ఉనికి గురించి సంక్షిప్తంగా ప్రస్తావించారు. తరువాత, ఈ పదం అనేకమంది ఐరోపా పర్యాటకుల గ్రంథాలలో కనిపించింది, మొదట ఫ్రెంచ్ మరియు పోర్చుగీస్, తరువాత ఆంగ్ల పర్యాటకులు, అందరూ ఈ పదం యొక్క ఐరోపా రూపాంతరమైన ఒక స్థానిక భాషాపదాన్ని ఉపయోగించారు. ఉదాహరణకు, పోర్చుగీసు వైద్యుడు గార్సియా డి'ఒర్త, 1563లో " కామ్బై రాజ్యంలో[...]ఎస్పార్సిస్ గా పిలువబడే [...] వర్తకులున్నారు అని పేర్కొన్నాడు. మన పోర్చుగీసు వారిని యూదులుగా పిలుస్తాము, కానీ వారు ఆవిధంగా లేరు. వారు జెంటియోలు." 20వ శతాబ్ద ప్రారంభానికి చెందిన చట్ట ప్రకటనలో (చూడుము స్వీయ-జ్ఞానము, క్రింద) న్యాయమూర్తులు దవార్ మరియు బీమన్ (1909:540) 'పార్సీ' అనే పదం కూడా ఇరాన్లో జొరాస్ట్రియన్లను సూచించడానికి ఉపయోగించబడుతుందని స్థిరపరచారు. హిందూ అనే పదాన్ని భారత ఉపఖండం నుండి వచ్చిన ఎవరినైనా సూచించడానికి ఇరానియన్లు ఏ విధంగా వాడతారో, 'పార్సీ' అనే పదాన్ని భారతీయులు, వారు పర్షియన్ జాతికి చెందిన వారా లేదా అనే దానితో సంబంధం లేకుండా గ్రేటర్ ఇరాన్ నుండి వచ్చిన వారందరికీ వాడతారు అని(Stausberg 2002, p. I.373) Boyce (2002, p. 105) సూచించాయి. ఏ సందర్భంలోనైనా, 'పార్సీ' అనే పదం దానికదే "వారి ఇరానియన్ లేదా 'పర్షియన్' మూలాలను సూచించదు, కానీ ఇది ఒక సూచిక— వారి జాతి గుర్తింపు యొక్క— అనేక లక్షణాలను విశద పరుస్తుంది"(Stausberg 2002, p. I. 373). అంతేకాక, (జాతి నిర్ధారణలో వారసత్వం మాత్రమే ఏకైక కారకమైతే) పార్సీలు— క్విస్సా ప్రకారం— పార్థియన్లుగా పరిగణించబడతారు. (Boyce 2002, p. 105) ఈ పదం 'పార్సీయిజం' (లేదా 'పార్సిజం') అంక్వేటిల్-డుపెర్రోన్, 1750లో 'జొరాస్ట్రియనిజం'అనే పదం కనిపెట్టక ముందు, పార్సీలు మరియు జొరాస్ట్రియనిజం గురించి సవిస్తరమైన నివేదిక ఇచ్చారు, దానిలో పార్సీలు మాత్రమే ఈ మతాన్ని అనుసరించే మిగిలి ఉన్న వారుగా దోషపూరితంగా పేర్కొనబడింది.

ఒక జాతి సమాజంగా

వివాహ వర్ణచిత్రం, 1948

పార్సీలు 10 శతాబ్దాల క్రితం గ్రేటర్ ఇరాన్ నుండి వలస వచ్చినప్పటికీ, వారు ఆ దేశంలోని ప్రజలతో సాంఘిక లేదా కుటుంబ సంబంధాలను పోగొట్టుకున్నారు మరియు వారితో ఏ విధమైన భాష లేదా ఇటీవలి కాలపు చరిత్రను పంచుకోవడం లేదు. జొరాస్ట్రియన్లు భారతదేశానికి వచ్చిన కొన్ని శతాబ్దాలలోనే, పార్సీలు తమని తాము భారత సమాజంతో సమీకృతం చేసుకొని అదే సమయంలో వారి స్వంత విభిన్న ఆచారాలను మరియు సంప్రదాయాలను(మరియు ఆవిధమైన తెగల గుర్తింపు) నిర్వహించుకున్నారు లేదా అభివృద్ధి పరచుకున్నారు. ఇది పార్సీ సమాజానికి ఒక ప్రత్యేక స్థాయిని కల్పించింది: జాతీయ అనుబంధం, భాష మరియు చరిత్ర వంటి వాటిలో వారు భారతీయులు, (మొత్తం జనాభాలో 0.006% ఉన్నారు) కానీ రక్త సంబంధం లేదా సాంస్కృతిక, ప్రవర్తన మరియు మతవ్యవహారాలలో వారు సాధారణ భారతీయులు కారు. వంశపారంపర్య స్వచ్ఛతను నిర్ధారించడానికి జరిపిన జన్యుపరమైన DNA పరీక్షలు మిశ్రమ ఫలితాలను ఇచ్చాయి. ఒక అధ్యయనం(Nanavutty 1970, p. 13)తాము స్థానిక ప్రజలతో వివాహాలను మానుకోవడం ద్వారా పర్షియన్ మూలాలను కాపాడుకున్నామన్న పార్సీల వివాదంతో ఏకీభవిస్తుంది. 2002లో జరిగిన పాకిస్తాన్ యొక్క పార్సీలకి చెందిన Y-క్రోమోజోమ్ (తండ్రి వారసత్వం) DNA యొక్క ఆ అధ్యయనంలో, పార్సీలు జన్యుపరంగా తమ పొరుగువారి కంటే ఇరానియన్లతో దగ్గరి సంబంధాలను కలిగి ఉన్నట్లు నిర్ధారించబడింది(Qamar et al. 2002, p. 1119). ఏదేమైనా, 2004 అధ్యయనంలో పార్సీ మైటోకాన్డ్రియాల్ DNA (తల్లి వారసత్వం) ఇరానియన్లు మరియు గుజరాతిలతో పోల్చబడినపుడు, జన్యుపరంగా వారు ఇరానియన్ల కంటే గుజరాతీలతో దగ్గరి సంబంధాలను కలిగి ఉన్నట్లు నిర్ధారించబడింది. 2002 అధ్యయనాన్ని పరిగణనలోకి తీసుకొని, 2004 అధ్యయనం యొక్క రచయితలు ఈ విధంగా సూచించారు "ప్రస్తుత పార్సీ జనాభా యొక్క పూర్వీకుల మగవాని-మధ్యవర్తిత్వ వలసలో, వారు స్థానిక స్త్రీలతో కలిసారు [...] ఇది చివరికి ఇరానియన్ మూలాలకు చెందిన mtDNA నష్టానికి దారితీసింది." (Quintana-Murci 2004, p. 840)

స్వీయ-జ్ఞానములు

పార్సీ నవ్జోత్ వేడుక (జొరాస్ట్రియన్ విశ్వాసంలోనికి ప్రవేశ మతకర్మ)

ఎవరు పార్సీ (మరియు ఎవరు కాదు) అనే నిర్వచనం భారతదేశంలోని జొరాస్ట్రియన్ సమాజంలో చాలా వివాదాస్పద విషయం. ఒక వ్యక్తి సాధారణంగా పార్సీగా అంగీకరించబడాలంటే: ఎ) సహజ పార్సీ శరణార్ధుల యొక్క ప్రత్యక్ష వారసులు; మరియు b) సాంప్రదాయకంగా జొరాస్ట్రియన్ మతంలోనికి అనుమతించబడినవాడు. ఈ భావంలో, పార్సీ ఒక స్థానిక మత-ప్రతినిధి.

సమాజంలోని కొందరు సభ్యులు అదనంగా ఒక వ్యక్తి పార్సీ మతంలోకి ప్రవేశించడానికి అర్హత పొందాలంటే తండ్రి తప్పనిసరిగా పార్సీ అయిఉండాలని పోరాడుతారు, కానీ ఈ సమ్మతి జొరాస్ట్రియన్ సిద్ధాంతాలైన లింగ సమానత్వానికి భంగమని, మరియు పార్సీ ల పురాతన న్యాయ నిర్వచన అవశేషమని అధికులు భావిస్తారు.

1909 రూలింగ్ పై ఆధారపడి తరచూ ఉల్లేఖించబడే పార్సీ నిర్వచనం (ప్రస్తుతం రద్దుచేయబడింది) ప్రకారం ఒక వ్యక్తి జొరాస్ట్రియన్ విశ్వాసంలోకి మారడం ద్వారా పార్సీ కాజాలడని నిర్దేశించింది(సమస్యాత్మక సందర్భం), అంతేకాక "పార్సీ సమాజం : ఎ)ప్రారంభ పర్షియన్ వలసదారుల వంశస్థులు మరియు ఇద్దరూ జొరాస్ట్రియన్ లైన తల్లిదండ్రులకు మరియు జొరాస్ట్రియన్ మతాన్ని ఆచరించే వారికి జన్మించినవారు; b)జొరాస్ట్రియన్ మతాన్ని అవలంబించే ఇరానీయులు [ఇక్కడ అర్ధం ఇరానియన్లు, కానీ భారతదేశ జొరాస్ట్రియన్ల మరొక సమూహం కాదు] ; c) పార్సీ తండ్రులకి మరియు క్రమపద్ధతిలో మతంలోకి అనుమతించబడిన పరమతానికి చెందిన తల్లులకి జన్మించిన బిడ్డలు."(Sir Dinsha Manekji Petit v. Sir Jamsetji Jijibhai 1909)

ఈ నిర్వచనం ఇప్పటికి అనేకసార్లు మార్చబడింది. భారత రాజ్యాంగం యొక్క సమానత్వ సూత్రాలు మూడవ క్లాజులో వ్యక్తీకరించబడిన పితృవంశపారంపర్య నియంత్రణలతో విభేదిస్తాయి. రెండవ క్లాజు వ్యతిరేకించబడి 1948లో రద్దుచేయబడింది.(Sarwar Merwan Yezdiar v. Merwan Rashid Yezdiar 1948) 1950లో పునఃపరిశీలన అభ్యర్ధనతో 1948 రూలింగ్ తిరిగి పునరుద్ధరించబడి 1909 నిర్వచనాన్ని తప్పనిసరిగా ఆచరించవలసిన న్యాయ అభిప్రాయం గా, అనగా, చట్టపరమైన ప్రభావం లేకపోయినా ఉమ్మడిగా ఆమోదించిన అభిప్రాయంగా పరిగణించారు(1966 తిరిగి-ధ్రువపరచబడినది).(Merwan Rashid Yezdiar v. Sarwar Merwan Yezdiar 1950;Jamshed Irani v. Banu Irani 1966) కాకపొతే, 1909 నాటి రూలింగ్ చట్టపరంగా ప్రభావం కలిగినదనే అభిప్రాయం, బాగా-చదువుకున్న మరియు నాగరీకులైన పార్సీలలో కూడా ఇప్పటికీ వ్యాప్తిలో ఉంది. 2006 ఫిబ్రవరి 21 నాటి పార్సీ జొరాస్ట్రియన్ సమాజం యొక్క పక్ష పత్రిక పార్సియాన పత్రిక సంపాదకీయంలో, పార్సీ తల్లికి మరియు పార్సీ-యేతర తండ్రికి జన్మించిన అనేక మంది యుక్తవయస్కులైన పిల్లలు ఈ మత విశ్వాసంలోకి ప్రవేశించారని మరియు వారి "తల్లి యొక్క విశ్వాసాన్ని అవలంబించాలనే వారి ఎంపిక మతం పట్ల వారి నిబద్దత గురించి ఎంతగానో చెప్తుంది" అని సంపాదకుడు పేర్కొన్నారు. ఈ రూలింగ్ ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ, "వారు చట్టపరంగా మరియు మతపరంగా సంపూర్ణ జొరాస్ట్రియన్లు అయినప్పటికీ, శాసన దృష్టిలో వారు పార్సీ జొరాస్ట్రియన్ గా పరిగణింపబడరు" అని కూడా ఆ సంపాదకడు పేర్కొంటూ "శాసనపరంగా పార్సీ జొరస్త్రియన్లకు ప్రత్యేకించబడిన [అగ్ని దేవాలయములను ] వారు పొందలేరు" అని పేర్కొన్నారు. (Parsiana 2006, p. 2).

జనాభా గణాంకాలు

ప్రస్తుత జనాభా

ఒక సాంప్రదాయక అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్త పార్సీల జనాభా సుమారు 100,000, అయితే వ్యక్తిగత అంచనాలు దీనితో ప్రముఖంగా విభేదిస్తూ; [5] "100,000 కంటే తక్కువ"గా ప్రకటిస్తాయి,[6] "సుమారు 110,000" అని ప్రకటిస్తాయి, మరియు [7] అంచనా ప్రకారం 110,000 ± 10%. మొదటి రెండు సంఖ్యలు 1980ల నాటి సమాచారంపై, ప్రత్యేకించి, ఆ దేశంలోని పార్సీలను 71,630 మందిగా లెక్కించిన 1981 నాటి భారతీయ జనాభాలెక్కలు, మరియు విదేశాలలో వ్యాప్తి చెందిన పార్సీల సంఖ్య కొరకు జాన్ హింనేల్ల్స్ యొక్క ప్రారంభ అంచనాలపై ఆధారపడ్డాయి. తరువాతి సంఖ్య విదేశాలలో వ్యాప్తి చెందిన పార్సీల సవరించిన సంఖ్య యొక్క నివేదికపై, ముంబై(ఇంతకు ముందు బాంబేగా పిలువబడేది) నగరం యొక్క పరిసర ప్రాంతాలపై దృష్టి కేంద్రీకరించి ఆ దేశంలో 69,601 పార్సీలు ఉన్నట్లుగా నివేదికను అందించిన 2001 నాటి భారతీయ జనగణనపై ఆధారపడింది.

భారతదేశం కాక ఇతర దేశాలను ఉన్నట్లు (స్థానిక పార్సీ/జొరాస్ట్రియన్ సంఘాలచే) నివేదించబడిన పార్సీ జనాభా: "బ్రిటన్, 5,000; USA, 6,500; కెనడా, 4,500; ఆస్ట్రేలియా, 300; పాకిస్తాన్, 3,000; హాంగ్ కాంగ్, 150; కెన్యా 80." (హిన్నెల్ల్స్ [8]లో). పార్సీలు తరతరాలుగా స్థిరపడిన ప్రాంతంలో భాగమైన పాకిస్తాన్ ను మినహాయించి, ఈ దేశాలలో పార్సీలు విదేశాలలో వచ్చి స్థిరపడిన వారు (మొదటి/రెండవ తరాలు).

జనాభా ధోరణులు

పార్సీల జనాభా అనేక దశాబ్దాలుగా స్థిరంగా తగ్గుతోందని భారతీయ జనగణన సమాచారం ధ్రువీకరిస్తోంది. అత్యధిక జనగణన 1940-41 నాటి 114,890 వ్యక్తులు, దీనిలో రాజ్య వలసల జనాభా అయిన ప్రస్తుత భారతదేశం, పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ ల జనాభాలు ఉన్నాయి. స్వాతంత్ర్య-అనంతరం కేవలం భారతదేశానికి సంబంధించి మాత్రమే జనగణనలు లభ్యమవుతున్నాయి(1951: 111,791) మరియు ఇవి దశాబ్దానికి సుమారు 9% చొప్పున జనాభా తగ్గుతోందని తెలియచేస్తున్నాయి.

నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ ప్రకారం, "ఈ సమాజం యొక్క జనాభా ఈవిధంగా స్థిరంగా తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయి", వీటిలో ముఖ్యమైనవి పిల్లలు లేకపోవడం మరియు వలసలు(Roy & Unisa 2004, p. 8, 21). జనగణన ధోరణులు 2020నాటికి పార్సీల జనాభా కేవలం 23,000(2001 భారతదేశ జనాభాలో 0.0002% కంటే తక్కువ) మాత్రమే ఉంటుందని అంచనా వేస్తున్నాయి. పార్సీలు అప్పుడు ఒక సమాజంగా కాక ఒక 'తెగ'గా గుర్తించబడతారు(Taraporevala 2000, p. 9).

ఈ జనాభా తరుగుదలలో ఐదవ వంతు వలసలకు ఆపాదించబడింది(Roy & Unisa 2004, p. 21). నిదానమైన జననాల రేటు మరియు మరణాల రేటు ఇతర కారణాలు: 2001నాటికి, 60 సంవత్సరాలు నిండిన జనాభా పార్సీ సమాజంలో 31% ఉన్నారు. ఈ వయో సమూహం యొక్క జాతీయ సగటు 7%. పార్సీ సమాజంలో కేవలం 4.7% మాత్రమే 6 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగి ఉన్నారు, దీనిని సాలుకు, 1000 మంది వ్యక్తులకు 7 జననాలుగా అన్వయించవచ్చు(Roy & Unisa 2004, p. 14).

జనాభా యొక్క ఇతర గణాంకాలు

పార్సీలలో స్త్రీ, పురుష నిష్పత్తి అసాధారణంగా ఉంది, 2001 నాటికి, మగవారితో ఆడవారి నిష్పత్తి ప్రతి 1000 మంది పురుషులకు 1050 స్త్రీలుగా(1991లో 1024 నుండి) ఉంది, దీనికి ప్రధాన కారణం జనాభాలో మధ్యవయసు వారు అధికంగా ఉండటం(సాధారణంగా పెద్ద వయసువారిలో పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ). జాతీయ సగటు 1000 మంది పురుషులకు 933 మంది స్త్రీలు.

పార్సీలలో అక్షరాస్యతా స్థాయి అధికంగా ఉంది: 2001 నాటికి, వారి అక్షరాస్త్యతా స్థాయి 97.9%, ఇది మరే ఇతర భారతీయ సమాజం కన్నా అత్యధికం(జాతీయ సగటు 64.8%). 96.1% పార్సీలు పట్టణప్రాంతాలలో నివసిస్తున్నారు (జాతీయ సగటు 27.8%).

పార్సీల జనసాంద్రత అత్యధికంగా ఉన్న గ్రేటర్ బాంబే ప్రాంతంలో, ca. 10% పార్సీ స్త్రీలు మరియు ca. 20% పార్సీ పురుషులు వివాహం చేసుకోవడం లేదు(Roy & Unisa 2004, p. 18, 19).

చరిత్ర

గుజరాత్ లో ఆగమనం

భారతదేశంలో జొరాస్ట్రియన్ శరణార్ధుల ప్రారంభ సంవత్సరాల గురించి, వారు వచ్చిన తేదీకి కనీసం ఆరు శతాబ్దాల తరువాత సంకలనం చేయబడిన, లభ్యమవుతున్న ఏకైక ఆధారం కిస్సా-ఇ సంజన్ "సంజన్ యొక్క కథ" ప్రకారం, వలసవాదుల యొక్క ఒక సమూహం(నేడు మొదటిదిగా భావించబడేది) (గ్రేటర్) ఖొరాసాన్ నుండి మొదలైంది(Hodivala 1920, p. 88). మధ్య ఆసియాలోని ఈ భాగం ఈశాన్య ఇరాన్ లో అంతర్భాగంగా (అక్కడ ఇది ఖొరాసాన్ రాష్ట్రంగా ఏర్పడుతుంది), ఉత్తర ఆఫ్ఘనిస్తాన్ లో అంతర్భాగంగా, మరియు మూడు మధ్య-ఆసియా గణతంత్రాలైన తజికిస్తాన్, తుర్కమెనిస్తాన్, మరియు ఉజ్బెకిస్తాన్ లలో భాగంగా ఉంది. క్విస్సా ప్రకారం, వలసవాదులకు స్థానిక ప్రభువు జాది రాణాచే, వారు స్థానిక భాషను(గుజరాతి) అనుసరించాలని, వారి స్త్రీలు స్థానిక వస్త్రధారణను అనుసరించాలని (చీర ) మరియు వారు అప్పటి నుండి ఆయుధాలు వదలివేయాలనే నిబంధనలతో, నివసించడానికి అనుమతి ఇవ్వబడింది(Hodivala 1920). శరణార్ధులు ఈ నిబంధనలకు అంగీకరించి, వారి స్వంతపట్టణం (నేటి తుర్కమెనిస్తాన్లో మెర్వ్ సమీపంలోని సంజన్) పేరు మీద సంజన్ అనే స్థావరాన్ని నిర్మించుకున్నారు.(Hodivala 1920, p. 88) మొదటి సమూహం వచ్చిన ఐదు సంవత్సరాలలోగా గ్రేటర్ ఖొరాసాన్ నుండి రెండవ సమూహం వారిని అనుసరించింది, ఈ సారి వారు వారితో పాటు మతపరమైన పరికరాలు (అలాట్ ) కలిగి ఉన్నారు. ఈ ఖోరసానిలు లేదా కోహిస్తాని లకు అదనంగా-ఈ రెండు ప్రారంభ సమూహాలు ఆరంభంలో పిలువబడినట్లు పర్వత జానపదులు (Vimadalal 1979, p. 2) - కనీసం ఒక ఇతర సమూహం సారి (ప్రస్తుత ఇరాన్ లోని మజాన్దరాన్) నుండి వచ్చినట్లు చెప్పబడుతుంది. (Paymaster 1954)

సంజన్ సమూహం మొదట స్థిరనివాసం ఏర్పరచుకున్నదిగా పరిగణించబడినప్పటికీ, వారి రాక గురించిన సమాచారం ఊహించుకున్నదిగా ఉంది. ఆని అంచనాలు క్విస్సా ఆధారంగా రూపొందించబడ్డాయి, అయితే అది గతించిన కొన్ని కాలాలకు సంబంధించి సందిగ్దంగా మరియు విరుద్ధంగా ఉంది. ఫలితంగా, మూడు సాధ్యమయ్యే తేదీలు-క్రీస్తుశకం 936, క్రీస్తుశకం 765 మరియు క్రీస్తుశకం 716-ఆగమనం జరిగిన సంవత్సరాలుగా ప్రతిపాదించబడ్డాయి, మరియు ఈ అననుకూలత "పార్సీల మధ్య [...]అనేక తీవ్రమైన యుద్ధాలకు" కారణంగా ఉంది(Taraporevala 2000). 18వ శతాబ్దానికి ముందరి పార్సీ గ్రంథాలలో తేదీలు ప్రత్యేకంగా ఇవ్వబడనందువలన, ఆగమనం గురించి ఏ తేదీ అయినా నిర్బంధంగా ఊహాత్మకంగానే ఉంది. క్విస్సా యొక్క ప్రాముఖ్యత ఏ సందర్భంలోనైనా సంఘటనల యొక్క పునఃనిర్మాణంపై కాక పార్సీల వర్ణనపై ఉంది- వారిని వారు చూసుకునే విధానం- మరియు ఆధిపత్య సంస్కృతితో వారి సంబంధాల వంటివి. ఆ విధంగా, ఈ గ్రంథం పార్సీల గుర్తింపు కల్పనలో కీలక పాత్ర పోషిస్తోంది. కానీ, "శాబ్దిక సమాచార ప్రసారంపై ఆధారపడిన చరిత్ర ఒక ఇతిహాసం కంటే ఎక్కువకాదు అనే ముగింపుకి ఒకరు వస్తే, అది పార్సీల భౌగోళిక చరిత్రకు నిస్సందేహంగా ఒక మంచి సమాచారపత్రం అవుతుంది." (Kulke 1978, p. 25)

కచ్చితంగా సంజన్ జొరాస్ట్రియన్ లు ఈ ఉపఖండానికి వచ్చినమొదటి జొరాస్ట్రియన్లు కారు. సింధ్ మరియు బలూచిస్తాన్ ఒకప్పుడు ససానిడ్ (క్రీస్తుపూర్వం226-651) సామ్రాజ్యపు తూర్పు వైపున చివరి ప్రదేశాలుగా ఉండేవి, అందువలన అవి అక్కడ సైనిక స్థావరాలను నిర్వహించేవి. ఈ ప్రాంతాలను నష్టపోయినప్పటికీ, ఇరానియన్ లు తూర్పు మరియు పశ్చిమాల మధ్య వర్తక సంబంధాలలో కీలక పాత్రను పోషించడం కొనసాగించారు, మరియు హిందువులు కలుషితం చేయడంగా భావించిన, సముద్రాలపై ప్రయాణాలను బ్రాహ్మణులు నిరుత్సాహపరచడం వలన, వారు గుజరాత్ లో కూడా వర్తక స్థావరాలను నిర్వహించి ఉండవచ్చు. 9వ శతాబ్దానికి చెందిన అరబ్ భౌగోళిక చరిత్రకారుడు అల్-మసూది అల్-హింద్ మరియు అల్-సింధ్ లలో అగ్ని దేవాలయాలను కలిగిన జొరాస్ట్రియన్ల గురించి సంక్షిప్తంగా తెలిపాడు. (Stausberg 2002, p. I.374) అంతేకాక, ఇరానియన్ లకు, గుజరాత్ యొక్క నౌకాశ్రయాలు భూభాగ సిల్క్ రహదారికి పూరకంగా ఉండే సముద్రతీర మార్గాలపై ఉన్నాయి మరియు ఈ రెండు ప్రాంతాల మధ్య విస్తృతమైన వ్యాపార సంబంధాలు ఉండేవి. ఉమ్మడి యుగముకు పూర్వమే ఇరానియన్లకు మరియు భారతీయులకు మధ్య సంబంధాలు చక్కగా ఏర్పడి ఉన్నాయి మరియు పురాణాలు మరియు మహాభారతం రెండూ కూడా సింధు నదికి పశ్చిమంగా ఉండే ప్రజలను సూచించడానికి పారసికులు అనే పదాన్ని ఉపయోగించాయి. (Maneck 1997, p. 15)

"పార్సీ ఇతిహాసాలు భారతదేశానికి వారి పూర్వీకుల వలస గురించి, వారి పురాతన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి మతోన్మాదులైన ముస్లిం ఆక్రమణదారులచే సైన్యంతో ముట్టడించబడి తప్పించుకున్న ఒక మతపరమైన శరణార్ధుల బృందంగా వర్ణిస్తాయి." (Maneck 1997, p. 15; cf. Paymaster 1954, pp. 2-3, Boyce 2001, p. 148, Lambton 1981, p. 205, Nigosian 1993, p. 42) ఏదేమైనా, కచ్చితంగా ఇరాన్ పై అరబ్ దాడి తరువాత భారత ఉపఖండం యొక్క పశ్చిమతీరం వెంట పార్సీ స్థావరాలు ఏర్పడటం మొదలైనప్పటికీ, ఈ వలసలు జొరాస్ట్రియన్ లకు వ్యతిరేకంగా మతపరమైన పీడన వలన జరిగినవని కచ్చితంగా పేర్కొనడం సాధ్యం కాదు. "సాంప్రదాయ" 8వ శతాబ్ద తేదీని (క్విస్సా నుండి ఊహించబడింది) ప్రామాణికంగా భావిస్తే, "వలసలు మొదలయేనాటికి జోరాస్ట్రియనిజం ఇరాన్ లో ఇంకా ప్రముఖమతంగానే ఉందని [మరియు] ప్రారంభంలో వలస గురించి నిర్ణయంలో ఆర్ధికకారకాలు ఆధిక్యత వహించాయని" ఊహించవలసి ఉంటుంది. (Maneck 1997, p. 15)క్విస్సా సూచించినట్లు- ప్రారంభంలో పార్సీలు ఈశాన్యం నుండి (అనగా మధ్య ఆసియా) వచ్చి సిల్క్ రోడ్ వర్తకంపై ఆధారపడినపుడు ఇది నిజమవుతుంది(Stausberg 2002, p. I.373). అయినప్పటికీ, 17వ శతాబ్దంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గురువైన హెన్రీ లార్డ్, పార్సీలు భారతదేశానికి "మనస్సాక్షి యొక్క స్వచ్ఛత"ను కోరుతూ వచ్చారని అయితే దానితోపాటే "వర్తకం మరియు లాభార్జన కొరకు, వ్యాపారస్తులు భారతదేశ తీరాలకు వెళ్లారు" అని నమోదు చేసారు. ముస్లింల అధీనంలో ఉన్న నౌకాశ్రయాల నుండి వర్తకం జరిపే ముస్లిమేతరులపై అరబ్ లు అధిక సుంకాలను విధించడం ఒక విధమైన మతపరమైన పీడనగా వ్యాఖ్యానించబడి ఉండవచ్చు, అయితే వలసపోవడానికి ఇది మాత్రమే కారణంగా కనిపించడం లేదు. పీడన మాత్రమే వలస పోవడానికి ఏకైక ప్రేరక కారణమా అనే దానిని పార్సీలు కూడా వారిలో వారు ప్రశ్నించుకుంటున్నారు(Nariman 1933, p. 277), మరియు "రెండు కారకాలు- వర్తకానికి నూతన ప్రదేశాలను ప్రారంభించడం, మరియు ముస్లిం పీడన లేని ప్రాంతంలో జొరాస్ట్రియన్ సమాజాన్ని స్థాపించాలనే కోరికతో-గుజరాత్ కి వలస వెళ్ళాలనే నిర్ణయానికి వచ్చారు." (Maneck 1997, p. 16)

ప్రారంభ సంవత్సరాలు

సంజన్ ఏర్పాటుకు దారితీసిన పరిస్థితుల గురించి క్విస్సా చాలా తక్కువ మాత్రమే ప్రస్తావిస్తుంది, మరియు "ఫైర్ అఫ్ విక్టరీ" ఏర్పాటు గురించి కేవలం (మధ్య పర్షియన్: ఆతాష్ బహ్రం ) సంజన్ వద్ద మరియు తరువాత నవ్సారి మార్పు వద్ద సంక్షిపమైన సూచనకు మాత్రమే పరిమితమైంది. ధల్లా ప్రకారం, తరువాత అనేక శతాబ్దాలు "కష్టాలతో నిండి ఉన్నాయి" (sic ) జోరాస్ట్రియనిజం "భారతదేశంలో నిజంగా కాలుమోపక ముందు మరియు " (Dhalla 1938, p. 447).

వారు వచ్చిన రెండు సంవత్సరాల తరువాత, పార్సీలు గుజరాత్ లోని ఇతర ప్రాంతాలలో కూడా నివాసం ఏర్పరచుకోవడం ప్రారంభించారు, ఇది "ఇది మతపరమైన అధికారాన్ని నిర్వహించడంలో కష్టాలకు దారితీసింది." (Kulke 1978, p. 29)ఈ సమస్యలు 1290 నాటికి గుజరాత్ ను ఐదు పన్తక్లు (జిల్లాలు) గా, ప్రతిదీ ఒక మతపరమైన కుంటుంబం మరియు వారి వారసుల అధికార పరిధిలోకి వచ్చేటట్లు విభజించడంతో పరిష్కరించబడ్డాయి. (అధికారంపై వివాదాలను కొనసాగింపు అతాష్ బహ్రం మీద అగ్నిని 1742లో ఉద్వాడాకు మార్చడానికి దారితీసింది, ప్రస్తుతం ఇక్కడ ఇది ఐదు పన్తక్ కుటుంబాల మధ్య వంతుల వారీగా మార్చుకోబడుతుంది).

ముంబై సమీపంలోని కన్హేరి గుహల వద్ద గల శాసనాలు కనీసం 11వ శతాబ్దం ప్రారంభం వరకు మిడిల్ పర్షియన్ జొరాస్ట్రియన్ మతాచార్యుల సాహిత్యపరమైన భాషగా ఉండేదని సూచిస్తున్నాయి. ఏది కాకున్నా, క్విస్సా మరియు కన్హేరి శాసనాలు కాక, 12 మరియు 13వ శతాబ్దాల వరకు పార్సీలకు సంబంధించి చాలా తక్కువ ఆధారాలు మాత్రమే లభ్యమవుతున్నాయి, ఆ కాలంలోనే "పాండిత్యపరమైన" (Dhalla 1938, p. 448) అవెస్తా యొక్క సంస్కృత అనువాదాలు మరియు నకలు ప్రతులు మరియు దానిపై వ్యాఖ్యానాలు రూపొందించడం ప్రారంభమైంది. ఈ అనువాదాల నుండి ధల్లా "ఈ కాలంలో మతపరమైన అధ్యయనాలు గొప్ప ఉత్సాహంతో కొనసాగించబడేవి" అని ఊహించారు మరియు పురోహితులలో మధ్య పర్షియన్ మరియు సంస్కృతాలపై ఉన్న పట్టు "గొప్ప క్రమానికి చెందినది" అని పేర్కొన్నారు.(Dhalla 1938, p. 448).

13వ శతాబ్దం నుండి 16వ శతాబ్దం చివరి వరకు గుజరాత్ కు చెందిన జొరాస్ట్రియన్ మతాధికారులు మతపరమైన మార్గదర్శకత్వం కొరకు (మొత్తం) ఇరవై-రెండు విన్నపాలను ఇరాన్ లోని వారి సహ-మతాధికారులకు పంపారు, దీనికి కారణం బహుశా వారు ఇరానియన్ జొరాస్ట్రియన్ లను "మతపరమైన విషయాలలో తమ కంటే ఎక్కువ తెలిసినవారుగా మరియు పురాతన సంప్రదాయాలను తాము పాటించిన దాని కంటే మరింత విశ్వసనీయంగా కాపాడినట్లు" భావించడం(Dhalla 1938, p. 457). ఈ సమాచార ప్రసారాలు మరియు వాటి ప్రత్యుత్తరాలు- సమాజంచే రివయాట్ లు(జాబులు) గా శ్రద్ధగా భద్రపరచబడ్డాయి-ఇవి 1478-1766 మధ్య విస్తరించి, మత మరియు సాంఘిక విషయాలతో వ్యవహరిస్తాయి. 21వ శతాబ్దపు బాహ్య దృష్టికోణంలో, ఈ ఇతోటర్ ("ప్రశ్నలు") లలో కొన్ని ఆశ్చర్యకరమైనంత అల్పంగా ఉంటాయి - ఉదాహరణకు, రివయాట్ 376: అవేస్తాన్ భాషా గ్రంథాలను చూచి వ్రాయడానికి జొరాస్ట్రియన్-యేతరుడు తయారు చేసిన సిరాను వాడవచ్చా-ప్రారంభ ఆధునిక జొరాస్ట్రియన్ల యొక్క భయాలు మరియు ఆందోళనను తెలుసుకునే అంతర్దృష్టిని అవి కలిగిస్తాయి. ఆ విధంగా, సిరా విషయంలో ప్రశ్న గుర్తింపుని కోల్పోతామనే భయాన్ని జీర్ణం చేసుకున్న సంకేతం; ఈ విషయం అడిగిన ప్రశ్నలను అధిగమించి ఒక వివాదంగా 21వ శతాబ్దం వరకు కొనసాగింది. ఇదే విధంగా జుడ్డిన్ లను (జొరాస్ట్రియన్లు-కానివారు) జొరాస్ట్రియనిజం లోనికి మార్చడానికి సంబంధించిన ప్రశ్న, దీనికి సంబంధించిన సమాధానం (R237, R238) : అంగీకరించతగినది, మరియు యోగ్యత కలిగినది.(Dhalla 1938, pp. 474-475)

ఏదేమైనా, "చెప్పుకోదగినంత కాలం వారు నివశించిన అనిశ్చిత పరిస్థితి వారి పూర్వ అన్యమత ఉత్సాహాన్ని కొనసాగించడాన్ని వారికి అసాధ్యంగా మార్చివేసింది. అనైక్యత గురించిన మరియు వారు నివసిస్తున్న పెద్ద సమూహాలలో కలిసిపోతామన్న స్వభావసిద్ధమైన భయం వారిలో ఒక ప్రత్యేకమైన ఉత్సాహాన్ని మరియు వారి జాతి లక్షణాలను మరియు వారి సమాజ విభిన్న లక్షణాలను కాపాడుకోవాలనే బలమైన భావనను సృష్టించాయి. హిందూ కుల వ్యవస్థ యొక్క అధికభారంతో నిండిన సమాజంలో నివసిస్తూ, ధృడమైన కుల హద్దుల చట్రంలోనే వారి భద్రత ఉందని వారు భావించారు"(Dhalla 1938, p. 474). అయినా కూడా, ఒక సమయంలో (వారు భారత దేశానికి వచ్చి ఎక్కువ కాలం కాకముందే), జొరాస్ట్రియన్లు- బహుశా వారితో తీసుకువచ్చిన సాంఘిక విభజన చిన్న సమాజంలో కొనసాగలేదని నిర్ధారించుకొని-వంశపారంపర్య పౌరోహిత్యం(ససానిడ్ ఇరాన్ లోఅస్రొనిహ్గా పిలువబడేవారు) తప్ప మిగిలిన అన్నిటినీ వదలివేసారు. మిగిలిఉన్న స్థితులలో- (ర)అతేష్తరిహ్ (ఉన్నతవర్గం, సైనికులు, మరియు పౌర సేవకులు), వస్తార్యోశిహ్ (వ్యవసాయదారులు మరియు పశువుల కాపరులు), హుతొక్శిహ్ (చేతివృత్తుల వారు మరియు శ్రామికులు) - అందరూ కలసి ఒక పెద్ద-విస్తారమైన నేటి బెహ్దిన్ ఐ ("దేనా " యొక్క అనుచరులు, దీనికి "మంచి మతం" అనేది ఒక అనువాదం) గా పిలువబడుతున్నారు. ఈ మార్పు చాలా పెద్ద ఫలితాలనే పొందింది. ఉదాహరణకు, అది కొంత వరకు ఒక జన్యు సమూహాన్ని ప్రారంభించింది ఎందుకంటే ఆ కాలం వరకు వర్గాల మధ్య వివాహాలు చాలా అరుదుగా జరిగేవి(మతాచార్యులకి ఇది ఒక సమస్యగా 20వ శతాబ్దం వరకు కొనసాగింది). మరొకటి, అది వృత్తిపరమైన గీతల సరిహద్దులను చేరిపివేసింది, పార్సీలు దీనిని 18వ మరియు 19వ శతాబ్ద బ్రిటిష్ వలస అధికారుల నుండి గ్రహించారు, వారు హిందూ కుల వ్యవస్థ యొక్క అనూహ్యమైన సమస్యలను పట్టించుకొనేవారు కాదు(ఒక కులానికి చెందిన గుమాస్తా మరొక దానికి చెందిన గుమాస్తాతో వ్యవహరించరాదు వంటివి).

అవకాశాల యుగం

1600ల ప్రారంభంలో ముఘల్ చక్రవర్తి జహంగీర్ మరియు ఇంగ్లాండ్ యొక్క జేమ్స్ Iల మధ్య వాణిజ్య ఒప్పందాన్ని అనుసరించి, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సూరత్ మరియు ఇతర ప్రాంతాలలో నివసించడానికి మరియు కార్మాగారాలను నిర్మించడానికి ప్రత్యేక హక్కులను పొందింది. అప్పటివరకు గుజరాత్ అంతటా వ్యవసాయ సమాజాలలో నివసిస్తున్న అనేకమంది పార్సీలు, కొత్త ఉద్యోగాలను అందుకోవడానికి బ్రిటిష్ వారు నడిపే స్థావరాలకు మారారు. 1668లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంగ్లాండ్ కు చెందిన చార్లెస్ II నుండి బొంబాయి యొక్క ఏడు దీవులను అద్దెకు తీసుకుంది. ఉపఖండంలో వారి మొదటి నౌకాశ్రయ నిర్మాణానికి అనువుగా ఈ దీవుల తూర్పు తీరంలో కంపెనీ ఒక లోతైన ఓడరేవును నిర్మించింది, మరియు 1687లో వారు వారి ముఖ్య కేంద్రాన్ని సూరత్ నుండి కొత్తగా అభివృద్ధిచెందిన స్థావరానికి తరలించారు. పార్సీలు వారిని అనుసరించి ప్రభుత్వం మరియు ప్రజా పనులతో సంబంధం ఉన్న నమ్మకమైన పదవులను ఆక్రమించడం ప్రారంభించారు(Palsetia 2001, pp. 47-57).

గతంలో అక్షరాస్యత పూజారివర్గానికి మాత్రమే పరిమితమైన కాలంలో, బ్రిటిష్ పాఠశాలలు ఆధునిక పార్సీ యువతకు కేవలం చదవటం మరియు వ్రాయడం మాత్రమేకాక, అక్షరాస్యత యొక్క విస్తృతార్ధంలో వారిని విద్యావంతులను చేయటానికి మరియు బ్రిటిష్ వ్యవస్థకు అనుగుణంగా పరిచయం పెంపొందించుకోవటానికి దోహదం చేశాయి. ఈ చివరి లక్షణాలు పార్సీలకు ఎంతగానో ఉపయోగపడి, వారిని "బ్రిటిష్ వారికి ప్రాతినిధ్యంవహించే వారిగా" చేయటమేకాక, ఈపనిని "మరే ఇతర దక్షిణాసియా ప్రజలకన్నా శ్రద్ధగా మరియు ప్రభావవంతంగా" చేసేవారిగా తయారుచేశాయి. (Luhrmann 2002, p. 861). బ్రిటిష్ వారు ఇతర భారతీయులను, " బద్ధకస్తులుగా, అమాయకులుగా, అవివేకులుగా, పైకి విధేయులుగా ఉండి లోపల వంచకులుగా" (Luhrmann 1994, p. 333) ఉండేవారిగా భావించగా, పార్సీలను మాత్రం వలస పాలకులైన తమ లక్షణాలు కలిగినవారిగా పరిగణించారు. మాన్డెల్స్లో (1638) వారిని వ్యాపార ప్రయత్నాలలో "కష్టపడేతత్త్వం", "చిత్తశుద్ధి" మరియు "నైపుణ్యం" కలవారిగా పేర్కొన్నాడు. 1804 నుండి 1811 వరకు బొంబాయి నమోదుకారుడైన జేమ్స్ మాకింతోష్ కూడా ఇదేవిధమైన పరిశీలనలను వ్యక్తంచేస్తూ, " పీడనకు దూరంగా భారతదేశానికి పారిపోయిన, ప్రాచీన ప్రపంచపు బలమైన దేశాలలో ఒకదాని యొక్క చిన్న అవశేషమైన పార్సీలు, అనేక తరాలపాటు అంధకారంలో మరియు దారిద్ర్యంలో మగ్గి, చివరికి వారికి తగిన ప్రభుత్వ పాలనలో త్వరితంగా ఎదిగి ఆసియాలోనే ప్రసిద్ధి చెందిన వ్యాపార వర్గంగా అభివృద్ధి చెందారని" పేర్కొన్నాడు.(Darukhanawala & Jeejeebhoy 1938, p. 33లో నమోదు చేయబడినది).

వీరిలో ఒకడైన రుస్తోం మానెక్ అనే పేరుగల వ్యాపార సంధానకుడు బహుశా డచ్ మరియు పోర్చుగీస్ పాలనలోనే ఐశ్వర్యాన్ని కూడబెట్టుకున్నాడు. 1702లో మానెక్, ఈస్ట్ ఇండియా కంపెనీకి మొదటి దళారీగా నియమించబడ్డాడు(అందువల్లనే "సేథ్" అనే పేరుకూడా పొందాడు), తరువాత సంవత్సరాలలో "అతను మరియు అతని పార్సీ సహచరులు పెద్దదైన పార్సీ సమాజం యొక్క వృత్తిపరమైన మరియు ఆర్ధిక అవకాశాలను విస్తృతపరిచారు(White 1991, p. 304). ఆ విధంగా, 18వ శతాబ్ద మధ్యకాలం నాటికి, బొంబాయి ప్రెసిడెన్సీకి చెందిన అన్ని దళారీ కార్యాలయాలు దాదాపుగా పార్సీల హస్తగతమయ్యాయి. ఆనాటి బ్రోచ్ (నేటి భరూచ్) కలెక్టర్ అయిన జేమ్స్ ఫోర్బ్స్ తన ఓరియెంటల్ మెమోయిర్స్ (1770)లో నమోదు చేసినట్లు: "బొంబాయి మరియు సూరత్ లలోని అనేక మంది ప్రముఖ వర్తకులు మరియు ఓడల యజమానులు పార్సీలు." "చురుకైన, ధృఢమైన, వివేకవంతులు మరియు జాగ్రత్త కలిగిన వారైన వారు, వారు అత్యంత గౌరవించబడే హిందుస్థాన్ యొక్క పశ్చిమతీరంలో కంపెనీ యొక్క పౌరులలో అత్యంత విలువైనవారు" (Darukhanawala & Jeejeebhoy 1938, p. 33లో ఉదహరించబడింది). క్రమంగా కొన్ని కుటుంబాలు "సంపదను మరియు ప్రాముఖ్యతను పొందాయి (సొరాబ్జీ, మోడి, కామ, వాడియా, జీజీభోయ్, రెడీమనీ, దాడిసేథ్, పెటిట్, పటేల్, మెహత, అల్ బ్లెస్, టాటా, మొదలైనవారు), వీరిలో అనేకమంది నగరం యొక్క ప్రజా జీవితంలో, మరియు అనేక విద్యా, పారిశ్రామిక, మరియు దాతృత్వ సంస్థలలో వారి భాగస్వామ్యానికి ప్రసిద్ధి చెందారు.Hull 1913; cf. Palsetia 2001, pp. 37-45, 62-64, 128-140, 334-135).

తన ఔదార్యంతో, మానెక్, నగరంలో పార్సీలు తమని తాము స్థిరపరచుకోవడానికి అవసరమైన అవస్థాపనా సౌకర్యాలను కల్పించడంలో సహాయం చేసాడు మరియు ఆ విధంగా చేయడంలో "1720లలో బొంబాయిని పార్సీల నివాస మరియు కార్యకలాపాల కేంద్రస్థానంగా ఏర్పరిచాడు"(White 1991, p. 304). (మిగిలిన) ముఘల్ అధికారులు మరియు అంతకంతకు ప్రాముఖ్యం పెరిగిన మరాఠాల మధ్య సమస్యల వలన 1720లు మరియు 1730లలో ఏర్పడిన సూరత్ యొక్క రాజకీయ మరియు ఆర్థిక ఏకాంతవాసం తరువాత, సూరత్ నుండి పెద్ద సంఖ్యలో పార్సీ కుటుంబాలు ఈ కొత్త నగరానికి వలస వచ్చాయి. 1700 నాటికి, "ఏ నమోదులోనైనా కొంతమంది వ్యక్తులు మాత్రమే వర్తకులుగా కనిపించేవారు; శతాబ్ది మధ్యకాలం నాటికి, వాణిజ్యంలో భాగమైన పార్సీలు బొంబాయి యొక్క ముఖ్యమైన వాణిజ్య సమూహాలలో ఒకరిగా మారారు"(White 1991, p. 312). మానెక్ యొక్క దాతృత్వం యాదృచ్ఛికంగా పార్సీల దానగుణం నమోదైన మొదటి సందర్భం. 1689లో, ఆంగ్లికన్ మతాచార్యుడు జాన్ ఒవింగ్టన్, సూరత్ లో ఈ కుటుంబం "పేదలకు సహాయం చేస్తుంది మరియు జీవించడాని మరియు సుఖానికి కావాల్సిన కోరికలను తీర్చడానికి సిద్ధంగా ఉంటుంది. వారి విశ్వజనీన ఔదార్యం, ఒకరికి పని కల్పించడం లేదా పనిచేయడానికి సిద్ధంగా ఉండటం మరియు సామర్ధ్యాన్ని కలిగి ఉండటం, దుర్బలురు మరియు దుఖితులకు కాలానుగుణంగా దాతృత్వాన్ని అందించడం, వారి తెగలో ఏ ఒక్కరినీ ఆసహాయులు లేదా యాచకులుగా బాధపడనివ్వకపోవడం" అని పేర్కొన్నాడు(Ovington 1929, p. 216).

"బొంబాయిలోని పార్సీలు" ఒక దారు చెక్కడం, ca. 1878

1728లో రుస్తోం యొక్క పెద్ద కుమారుడైన నోరోజ్ (తరువాతి కాలంలో నోరోజీ) కొత్తగా వస్తున్న పార్సీలకు మతపరమైన, సాంఘిక, న్యాయ మరియు ఆర్థిక విషయాలలో సహకారం అందించడానికి బొంబాయి పార్సీ పంచాయత్ (నేటి కాలంలోని ట్రస్ట్ అనే భావంలో కాక స్వీయ-పరిపాలనకు ఒక సాధనంగా) ను నెలకొల్పాడు. మానెక్ సేథ్ కుటుంబం వారి కాలంలో వారికిచ్చిన అపారమైన వనరులను, శక్తి మరియు పార్సీ సమాజానికి ఉన్న అనల్పమైన ఆర్థిక వనరులను ఉపయోగించుకొని, 18వ శతాబ్ది మధ్య నాటికి, పార్సీలకు పంచాయత్ నగర జీవితం యొక్క ఆవశ్యకతలను పొందడానికి అంగీకరించదగిన మార్గంగా మరియు సమాజం యొక్క విషయాలను నియంత్రించే గుర్తింపు పొందిన సాధనంగా ఉండేది(Karaka 1884, pp. 215-217). ఏదేమైనా, 1838 నాటికి పంచాయత్ అక్రమాలు మరియు బంధుప్రీతిల వలన దాడికి గురైంది. 1855లో బోంబే టైమ్స్ పంచాయత్ పూర్తిగా నీతి లేదా దాని నియమాలను(బందోబస్త్స్ లేదా ప్రవర్తనా నియమావళి) అమలుపరచడానికి అవసరమైన న్యాయ అధికారం కలిగి లేదని ప్రచురించింది మరియు వెంటనే ఈ సంఘాన్ని సమాజానికి ప్రతినిధిగా భావించడాన్ని మానివేశారు(Dobbin 1970, p. 150-151). జూలై 1856 జుడిషియల్ కమిటీ అఫ్ ది ప్రివీ కౌన్సిల్ ఆదేశం యొక్క నేపథ్యంలో, పార్సీల వివాహం మరియు విడాకులకు చెందిన విషయాలు దాని పరిధిలోకి రావు, పంచాయత్ కేవలం ప్రభుత్వ గుర్తింపు పొందిన "పార్సీ వివాహ ఆవరణ" స్థాయికి తగ్గించబడింది. సమాజ ఆస్తి యొక్క నిర్వాహకురాలిగా పంచాయత్ చివరికి పునః స్థాపించబడినప్పటికీ, అది స్వీయ-పరిపాలనా సాధనంగా పనిచేయడం నిలిచిపోయింది(Palsetia 2001, pp. 223-225).

అదే సమయంలో పంచాయత్ పాత్ర తగ్గుతూ ఉండటం వలన, అనేక ఇతర సంస్థలు ఉద్భవించి సమాజం నిరాశగా ఎదురుచూస్తున్న సాంఘిక సమన్వయ భావనను పెంపొందించడంలో పంచాయత్ యొక్క స్థానాన్ని ఆక్రమించాయి. శతాబ్ది మధ్య నాటికి, పార్సీలు వారి సంఖ్య తగ్గడంపట్ల చేతనులయ్యారు మరియు ఈ సమస్య సాధనకు విద్య ఒక పరిష్కారంగా భావించారు. 1842లో జమ్సేట్జి జీజీభోయ్ సూరత్ మరియు దాని పరిసరప్రాంతాలలో నివసిస్తున్న నిరుపేద పార్సీల పరిస్థితులను, విద్య ద్వారా మెరుగుపరచాడానికి "పార్సీ బెనేవోలేంట్ ఫండ్"ను స్థాపించారు. 1849లో పార్సీలు వారి మొట్టమొదటి పాఠశాలను(ఆ కాలంలో నూతన ధోరణి అయిన సహధ్యాయ పాఠశాల, కానీ త్వరలోనే బాలబాలికలకు వేరువేరుగా విభజించబడింది) ప్రారంభించడంతో వారి విద్యా ఉద్యమం వేగవంతం అయింది. పార్సీ పాఠశాలల సంఖ్య బాగా పెరిగింది కానీ ఇతర పాఠశాలలు మరియు కళాశాలలో కూడా చేరేవారు(Palsetia 2001, pp. 135-139). మంచి విద్య మరియు సాంఘిక సమన్వయాలతో జతకలిసి, ఈ సమాజం యొక్క విస్పష్ట భావం పెరిగింది మరియు 1854లో ఇరాన్ లో భాగ్యవిహీనులైన సహ-మతస్తుల కొరకు దిన్షా మానేక్జి పెటిట్ "పర్షియన్ జొరాస్ట్రియన్ అమెలియోరేషన్ ఫండ్"ను స్థాపించారు. ఈ ఫండ్ అనేకమంది ఇరానియన్ జొరాస్ట్రియన్ లను భారతదేశానికి వలస వచ్చేటట్లు ప్రోత్సహించింది(అక్కడ వారు ఇప్పటికీ ఇరానీలుగానే పిలువబడుతున్నారు), మరియు వారి సహ-మతస్తులకు 1882లో జిజయ పన్ను విమోచన కల్పించడంలో సాధనంగా ఉండవచ్చు.

18వ మరియు 19వ శతాబ్దాలలో "భారతదేశంలోని విద్య, పారశ్రామిక, మరియు సాంఘిక విషయాలలో ముఖ్యులుగా" పార్సీలు ఎదిగారు. వారు అభివృద్ధికి మార్గదర్శకులుగా మారారు, అధిక మొత్తాలను సంపాదించారు, మరియు ఔదార్యంతో పెద్ద మొత్తాలను దానంగా ఇచ్చారు"(Dhalla 1948, p. 483). 19వ శతాబ్దం చివరి నాటికి వలసరాజ్యమైన భారతదేశంలో పార్సీల మొత్తం జనాభా 85,397, దీనిలో 48,507 మంది బొంబాయిలో నివసిస్తూ నగర మొత్తం జనాభాలో 6% గా ఉన్నారు(1881 జనగణన ప్రకారం). పార్సీలు నగరంలో సంఖ్యాపరంగా అల్పసంఖ్యాకులుగా పరిగణింపబడటం ఇదే చివరిసారి.

ఏదేమైనా, 19వ శతాబ్ద వారసత్వం ఒక సమాజంగా స్వీయ-అప్రమత్తత స్పృహను కలుగచేసింది. 17 మరియు 18వ శతాబ్దాల పార్సీల సాంస్కృతిక చిహ్నాల నమూనాలైన (a Parsi variant of Gujarati), కళ&చేతివృత్తులు మరియు వస్త్రధారణ అభిరుచులు వంటివి పార్సీ రంగస్థలం, సాహిత్యం, దినపత్రికలు, పత్రికలూ మరియు పాఠశాలలుగా అభివృద్ధి చెందాయి. పార్సీలు ఇప్పుడు సమాజ వైద్య కేంద్రాలను, అంబులెన్స్ భటులను, బాయ్ స్కౌట్ దళాలు, క్లబ్ లు మరియు సంఘ సంబంధ వసతి గృహాలను నడిపారు. వారికి వారి స్వంత దాతృత్వ సంస్థలు మరియు నివాస ఆస్తులు, న్యాయ సంస్థలు, న్యాయస్థానాలు మరియు పరిపాలన ఉండేవి. వారు ఇంకా నేతవారిగానో మరియు చిల్లర వర్తకులుగానో లేరు, బ్యాంకులు, మిల్లులు, భారీ పరిశ్రమ, నౌకాశ్రయాలు మరియు నౌకానిర్మాణ సంస్థలను స్థాపించి నడుపుతున్నారు. అంతేకాక, వారి స్వంత సాంస్కృతిక గుర్తింపుని కాపాడుకుంటూనే వారు జాతీయతాపరంగా భారతీయులుగా గుర్తించబడటంలో వెనుకబడలేదు, బ్రిటిష్ పార్లమెంట్ లో మొదటి స్థానాన్ని పొందిన ఆసియా వాసి అయిన దాదాభాయి నౌరోజీ పేర్కొన్నట్లు: "నేను ఒక హిందూ అయినా, ఒక ముస్లిం, ఒక పార్సీ, ఒక క్రైస్తవుడిని, లేదా మరే ఇతర జాతికి చెందిన వాడినైనా, అన్నిటికీ మించి నేను ఒక భారతీయుడిని". మా దేశం భారతదేశం; మా జాతీయత భారతీయత". (Ralhan 2002, p. 1101)

భారతదేశ విభజన

భారతదేశ విభజన సమయంలో; పాకిస్తాన్ నగరమైన కరాచీలో నివసిస్తున్న అనేకమంది పార్సీలు బలవంతంగా ఇస్లాంలోకి మార్చబడ్డారు ఇంకా కొందరు చంపబడ్డారు. కొందరు భారతదేశానికి పారిపోయారు.[9]

సమాజంలో అసమ్మతి

పార్సీ జషన్ వేడుక (ఈ సందర్భంలో, ఒక గృహప్రవేశం)

క్యాలెండరు యొక్క తేడాలు

ఈ విభాగం ప్రత్యేకించి పార్సీ క్యాలెండరుకు సంబంధించిన సమాచారాన్ని కలిగి ఉంది. జొరాస్ట్రియన్లు మతపరమైన అవసరాలకు ఉపయోగించిన క్యాలెండరు సమాచారం కొరకు, దాని చరిత్రకు సంబంధించిన వివరాలు మరియు దాని తేడాలకు, జొరాస్ట్రియన్ క్యాలెండర్ చూడండి.

12వ శతాబ్దం వరకు అందరు జొరాస్ట్రియన్లు ఒకే విధమైన 365-రోజుల మతపరమైన క్యాలెండరును అనుసరించారు, ఇది ఏ విధమైన పెద్ద మార్పులు లేకుండానే క్యాలెండరు సంస్కరణలు అర్దాషిర్ I (r. క్రీస్తుశకం 226-241) నుండి ఉంది. ఆ క్యాలెండరు సౌర సంవత్సరంలో రోజులో భాగాలకు విలువనివ్వక పోవడంతో, కాలంతోపాటు అది ఋతువులకు తగినట్లు అనుకూలంగా ఉండలేక పోయింది.

1125 మరియు 1250ల మధ్య ఒక సమయంలో (cf. Boyce 1970, p. 537), పార్సీలు అధికమైన రోజులోని భాగాలను సమానం చేసేందుకు ఒక కల్పిత నెలను పొందుపరచారు. ఏదేమైనా, పార్సీలు ఆ విధంగా చేసిన ఏకైక జొరాస్ట్రియన్లు (మరియు ఆ విధంగా ఒక్కసారి మాత్రమే చేసారు), దాని ఫలితంగా-అప్పటి నుండి-పార్సీలు ఉపయోగిస్తున్న క్యాలెండరు మరియు ఇతర ప్రాంతాలలో జొరాస్ట్రియన్లు ఉపయోగిస్తున్న క్యాలెండరుతో ముప్ఫై రోజులతో విభేదిస్తుంది. ఈ కాలెండర్లు అప్పటికీ ఒకే పేరుని కలిగి ఉండేవి, షహెన్షాహీ (సామ్రాజ్య), బహుశా ఈ క్యాలెండర్లు ఇంకా ఒకే విధంగా కొనసాగడం లేదని ఎవ్వరికీ తెలియదు.

ఒక పార్సీ వివాహం, 1905

1745లో సూరత్ మరియు పరిసరాలలోని పార్సీలు వారి మతాచార్యుల సలహా ప్రకారం కద్మి లేదా కాడిమి క్యాలెండర్ కు మారారు, వారు పురాతన 'స్వదేశం'లో ఉపయోగిస్తున్న క్యాలెండరు కచ్చితమైనదని నమ్మి ఉంటారు. అంతేకాక, వారు షహెన్షాహీ క్యాలెండర్ ను "రాజపక్షావలంబి"గా తృణీకరించారు.

1906లో రెండు వర్గాలను కలిపే ప్రయత్నాలు మూడవ క్యాలెండరు ప్రవేశ పెట్టడానికి దారితీసాయి (11వ శతాబ్ద సెల్జుక్ నమూనాపై ఆధారపడింది) : ఈ ఫసిలి, లేదా ఫస్లి క్యాలెండర్ నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చే లీపు దినాలను కలిగి ఉంది మరియు దీని నూతన సంవత్సర ప్రారంభ దినం వసంత విషవత్తు నాడు వస్తుంది. ఋతువులతో అనుగుణంగా ఉండే క్యాలెండరు ఇది ఒక్కటే అయినప్పటికీ, ఇది జొరాస్ట్రియన్ సాంప్రదాయ (డేన్కార్డ్ 3.419) ఆజ్ఞలకు లోబడి లేదనే ఆరోపణలపై పార్సీ సమాజం యొక్క అధికభాగం సభ్యులు దీనిని తిరస్కరించారు.

ప్రస్తుతం పార్సీలలో అధికభాగం షహెన్షాహీ క్యాలెండర్ యొక్క పార్సీ రూపాంతరాన్ని అనుసరిస్తున్నారు. సూరత్ మరియు భరూచ్ లలో ఉన్న పార్సీ సమాజాలలో కద్మి క్యాలెండర్ అనుసరించే వారు ఉన్నారు. పార్సీలలో ఫాస్లి క్యాలెండర్ అనుసరించే వారు ఎక్కువగా లేరు, కానీ- బస్తాని క్యాలెండర్ కు అనుగుణంగా ఉండే సుగుణం వలన (ఫాస్లి క్యాలెండర్ తో సమానమైన లక్షణాలతో అభివృద్ధి చెందిన ఇరానియన్ క్యాలెండర్) - ఇది ఇరాన్ యొక్క జొరాస్ట్రియన్ లలో అధికంగా ఉంది.

క్యాలెండర్ వివాదాల పర్యవసానం

కొన్ని అవెస్ట ప్రార్థనలలో కొన్ని నెలల పేర్లు సూచించబడ్డాయి మరియు కొన్ని ఇతర ప్రార్థనలు సంవత్సరంలోని కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రమే ఉపయోగించబడతాయి, ఏ క్యాలెండర్ "ఖచ్చితమైనది" అనే దానిపై మతపరమైన శాఖలు ఉన్నాయి.

విషయాలు మరింత చిక్కుల్లో పడేందుకు, 1700ల చివరిలో (లేదా 1800 చివరిలో) కడ్మి క్యాలెండరు యొక్క ఒక అత్యంత శక్తివంతమైన పెద్ద-మతాధికారి మరియు బలమైన సమర్ధకుడు-బొంబాయిలోని బెహ్రం- డాడిసేథ్ అతాష్ యొక్క ఫిరోజ్ కౌస్ దస్తూర్- ఇరాన్ నుండి వచ్చిన సందర్శకులు ఉచ్చరించిన ప్రార్థనల యొక్క ఉచ్చారణలు కచ్చితంగా ఉన్నాయని వాటితో సంతృప్తి చెందారు, అయితే పార్సీలచే చేయబడిన ఉచ్ఛారణ అంత కచ్చితంగా లేదు. ఆయన అనుగుణంగా కొన్ని ప్రార్థనలు(అన్నీ కాదు) మార్చడానికి పూనుకున్నారు, ఇవి కాలానుగుణంగా అందరు కడ్మి క్యాలెండర్ అనుసరించేవారిచే పురాతనమైనదిగా అనుసరించబడింది (మరియు కచ్చితంగా అనుకోబడింది). ఏదేమైనా, ఈ ఉచ్ఛారణలో మార్పును ఇరాన్లో హల్లు-మార్పు వలన సంభవించినదిగా మరియు కాడ్మి లచే అనుసరించబడిన ఇరానియన్ ఉచ్ఛారణ కాడ్మి -యేతర పార్సీలు ఉచ్ఛరించిన దానికంటే మరింత ఆధునికమైనదిగా అవెస్టన్ భాష మరియు భాషాశాస్త్ర సంబంధాల పండితులు అన్వయిస్తారు.

ఈ క్యాలెండర్ వివాదాలు ఎప్పుడూ పూర్తి విద్యా సంబంధమైనవిగా లేవు. 1780లలో, వివాదాలపై భావావేశాలు బాగా పెరిగి అప్పుడప్పుడు హింసకు దారితీసాయి. 1783లో భరూచ్ లో నివసించే హొమాజీ జమ్షెడ్జీ అనే షహెన్షాహీ, ఒక యువ కాడ్మి స్త్రీని తన్ని ఆమె గర్భస్రావానికి కారణమైనందుకు మరణశిక్ష విధించబడింది.

భారతదేశంలోని ఐదు అతాష్-బెహ్రంలలో (అత్యున్నత స్థాయి అగ్ని దేవాలయం), మూడు కాడ్మి ఉచ్ఛారణ మరియు క్యాలెండర్ ను అనుసరించగా, మిగిలినవి షహెన్షాహీ అనుసరిస్తున్నాయి. ఫస్సలి లకు వారి స్వంత అతాష్-బెహ్రం లేవు.

ఇల్మ్-ఏ-క్ష్నూమ్

ఇల్మ్-ఏ-క్ష్నూమ్ ('పారవశ్య విజ్ఞానం', లేదా 'బ్రహ్మానంద విజ్ఞానం') అనే పార్సీ-జొరాస్ట్రియన్ తత్వశాస్త్రం యొక్క శాఖ మతపరమైన గ్రంథాల యొక్క సాహిత్య, వ్యాఖ్యానాలపై కాక గూఢమైన మరియు రహస్యమైన వాటిపై ఆధారపడింది. ఈ శాఖను అనుసరించే వారి ప్రకారం, కాకసస్ (ప్రత్యామ్నాయంగా, డమవాండ్ పర్వతపరిసరాలలోని అల్బోర్జ్ శ్రేణి, పరిసరాలు) పర్వత ప్రాంతంలోని ఖాళీ స్థలాలలో ఏకాంతంగా నివసించే 2000 మంది వ్యక్తుల వంశంచే కాపాడబడే సాహెబ్-ఇ-దిలాన్ ('హృదయ యజమానులు') అనే జొరాస్ట్రియన్ విశ్వాసాన్ని వారు అనుసరిస్తారు.

ఒక పార్సీ ఒక క్ష్నూమ్ అనుసరించేవాడై ఉండవచ్చనే దానికి కొన్ని స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. వారి కుస్తీ ప్రార్థనలు ఫస్సలి యొక్క ప్రార్థనల వలె ఉన్నప్పటికీ, ఇతర పార్సీ సమాజం వలె, క్ష్నూమ్ అనుసరించేవారు కూడా వారు ఏ క్యాలెండర్ అనుసరించాలనే దానిపై భిన్నాభిప్రాయాలతో ఉన్నారు. కొన్ని విభాగాలలో పెద్ద ప్రార్థనలను వల్లె వేయడం వంటి వాటిలో, పూజాసంబంధ పాఠముల వల్లె వేయడంలో స్వల్ప భేదాలు కూడా ఉన్నాయి. ఏమైనప్పటికీ, క్ష్నూమ్ వారి భావజాలంలో తీవ్ర సాంప్రదాయవాదులు, మరియు ఇతర పార్సీల నుండి కూడా ఒంటరితనాన్ని అభిలషిస్తారు.

క్ష్నూమ్ అనుచరుల అతి పేద సమాజం బొంబాయి శివారు ప్రాంతమైన జోగేశ్వరిలో నివసిస్తున్నారు, అక్కడ వారికి వారి స్వంత అగ్ని దేవాలయం(బెహ్రంషా నౌరోజీ ష్రాఫ్ దరేమేహేర్), వారి స్వంత నివాస సముదాయం (బెహ్రం బాగ్) మరియు వారి స్వంత వార్తాపత్రిక (పార్సీ పుకార్ ) ఉన్నాయి. 19 వ శతాబ్దపు చివరి దశాబ్దాలలో ఈ విభాగం యొక్క అనుచరులు తక్కువ సంఖ్యలో సూరత్లో ఉన్నారు.

మినహాయింపులు వాటికి విరుద్ధంగా చేర్పులు

దాని కేంద్రభాగంలో, శతాబ్దాల పూర్వ ఉత్సుకత మరియు ఇతరులతో సమానమవుతామనే మరియు గుర్తింపు కోల్పోతామనే భయం ఈ వివాదం వెనుక స్పష్టంగా ఉన్నాయి.

ఏదేమైనా, అభ్యాసపరమైన ప్రశ్నలలో, ఈ వివాదం (దాదాపు) విద్వత్సంబంధమైనది. పార్సీ సమాజాలు పెద్దవిగా ఉన్న నగరాలలో, కనీసం ఒక అగ్ని దేవాలయమైనా కచ్చితంగా బహిష్కరించబడని మతాచార్యులచే నడుపబడుతుంది. ఏ సంఘటనలోనైనా, జొరాస్ట్రియన్ విశ్వాసం అగ్ని దేవాలయంలో ఆరాధనను అనుమతించదు, అందువలన— సూత్రప్రాయంగా— ఒక ప్రత్యేక దేవాలయంలోకి అనుమతి నిషేధించబడిన జొరాస్ట్రియన్ అతని/ఆమె గృహం నుండి పూజించవచ్చు.

ఈ వివాదం యొక్క ఫలితం ఏమైనప్పటికీ, అది బహుశా పార్సీల తగ్గుతున్న జనాభాకు ఏ విధంగానూ సహాయపడదు: తక్కువ జనన రేటు.

మరణించిన వారికి సంబంధించిన విషయాలు

సాంప్రదాయకంగా, కనీసం ముంబై మరియు కరాచీలలో, చనిపోయిన పార్సీలను టవర్స్ అఫ్ సైలెన్స్ వద్దకు తీసుకువెళతారు, అక్కడ నగరంలోని గ్రద్దలు శవాలను వెంటనే తింటాయి. ఈ పద్ధతికి కారణం భూమి, అగ్ని మరియు జలం పవిత్రమైనవిగా భావించబడతాయి, అందువలన వాటిని మరణంచే మలినం చేయరాదు. అందువలన, పార్సీ సంస్కృతిలో ఖననం లేదా దహనం ఎల్లపుడూ నిషేధించబడ్డాయి. విస్తృత పట్టణీకరణ, మరియు దానితో పాటు మానవులకు మరియు పశువులకు బాధా నివారిణిగా వాడే మందు దిక్లోఫెనక్ చే విషపూరితం కావడం వలన ముంబై మరియు కరాచీలలో గ్రద్దల జనాభా వేగంగా తగ్గడం నేటి సమస్య. దీని ఫలితంగా, చనిపోయిన వారి శరీరాలు క్రుళ్ళి పోవటానికి చాలా ఎక్కువ సమయం పడుతోంది, ఇది సమాజంలోని కొన్ని వర్గాల వారిని నిస్పృహకు గురిచేసింది. టవర్స్ అఫ్ సైలెన్స్ వద్ద క్రుళ్ళిపోయే ప్రక్రియను వేగవంతం చేయడానికి సౌరచట్రాలను ఏర్పాటు చేసారు కానీ అవి పాక్షికంగా మాత్రమే విజయవంతం అయ్యాయి. ఖననాలు మరియు దహనాలపై నిషేధం ఎందుకు ఎత్తివేయరాదనే విషయంపై సమాజంలో వివాదం చెలరేగుతోంది.

ముంబై యొక్క టవర్ అఫ్ సైలెన్స్ మలబార్ హిల్ ప్రాంతంలో ఉంది. మలబార్ హిల్ మరియు పరిసర ప్రాంతాల నివాసితులు ఈ పద్ధతికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేసారు. పార్సీలకు ఇప్పుడు టవర్ అఫ్ సైలెన్స్ లేదా ఖననాలకు మధ్య ఎంపిక ఇవ్వబడింది.

ప్రముఖ పార్సీలు

ఫ్రెడ్డీ మెర్క్యురీ

భారతదేశ చరిత్ర మరియు అభివృద్ధికి పార్సీలు పరిగణించదగిన సేవలను అందించారు, అన్నిటి కంటే ఎక్కువగా గుర్తించాల్సినది వారి స్వల్ప జనసంఖ్య. "పార్సీ, నీ పేరే దాతృత్వం" అనే నీతివాక్యం సూచించినట్లు, వారి సాహిత్యపరమైన మరియు సంఖ్యాపరమైన దయాగుణం వారి అతి గొప్ప సహాయం ("పార్సీ" అనే పదానికి సంస్కృత అర్ధం "చేయిని అందించేవాడు". మహాత్మా గాంధీ ఎక్కువ భాగం తప్పుగా ఉల్లేఖించబడిన తన ప్రకటనలో, "సంఖ్యాత్మకంగా తక్కువగా ఉన్నప్పటికీ, దాతృత్వం మరియు దయాగుణంలో అసమానులు మరియు అధిగమించలేనివారైన అద్భుతమైన జొరాస్ట్రియన్ జాతిని తయారుచేసిన నా దేశమైన భారతదేశాన్ని చూసి నేను గర్విస్తున్నాను" అని పేర్కొన్నారు(Rivetna 2002).

ముంబైలో నారిమన్ పాయింట్తో పాటు అనేక ప్రముఖ స్థలాలు పార్సీల పేరు మీదుగా ఉన్నాయి. భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖ పార్సీలలో ఫిరోజ్ షా మెహతా, దాదాభాయ్ నౌరోజీ, మరియు భికాజీ కామా ఉన్నారు.

విజ్ఞాన మరియు పారిశ్రామిక రంగాలలో ప్రత్యేక గుర్తింపు పొందిన పార్సీలలో, భౌతిక శాస్త్రవేత్త హోమీ భాభా, మరియు పారిశ్రామిక కుటుంబాలైన టాటా, గోద్రెజ్ మరియు వాడియాలకు చెందినా అనేకమంది సభ్యులు ఉన్నారు. ప్రత్యేక ప్రసిద్ధి చెందిన పార్సీ సంగీతకారులలో ఫ్రెడ్డీ మెర్క్యురీ, రూపకర్త కైఖోస్రు షపుర్జి సొరాబ్జీ మరియు నిర్వాహకుడు జూబిన్ మెహతా ఉన్నారు.

సిద్ధాంతకర్త హోమీ భాభా; సినీ రచయిత మరియు ఛాయాగ్రాహకుడు సూని తారాపూర్ వాలా; రచయితలు రోహింటన్ మిస్త్రీ, ఫిర్దౌస్ కంగా, పాకిస్తానీ రచయిత బాప్సి సిధ్వా, అర్దాషిర్ వకీల్ మరియు పాకిస్తానీ పరిశోధనాత్మక విలేఖరి అర్దేషిర్ కవస్జీ వంటి వారు కళలు మరియు సాంస్కృతిక రంగాలలో ప్రసిద్ధి చెందిన పార్సీలు. భారత సైన్య మొదటి ఫీల్డ్ మార్షల్, సామ్ మనేక్ షా కూడా పార్సీ సమూహానికి చెందిన వారు.

ప్రజాదరణ సంస్కృతిలో ప్రాతినిధ్యాలు

  • 2005 గ్రంథం ది స్పేస్ బిట్వీన్ అస్లో త్రిటీ ఉమ్రీగర్ ఒక పార్సీ వనిత మరియు ఆమె పార్సీ-యేతర పనిమనిషి గురించి వ్యవహరిస్తుంది. పార్టీలు, అంత్య క్రియలు మరియు విలువల గురించి సంభాషణల వర్ణనలు ముంబైలో ప్రస్తుత పార్సీ జీవిత దృష్టికోణాన్ని ఆవిష్కరిస్తాయి.
  • హెర్మన్ మెల్విల్లే యొక్క నవల మోబి-డిక్లో కెప్టెన్ అహబ్కు చెందిన రహస్య వేల్ బోట్ యొక్క నాయకుడు ఫెదల్లా "పార్సీ"గా సూచించబడ్డాడు. దీనిలో కొన్ని జొరాస్ట్రియన్ సాంప్రదాయాలు, ప్రత్యేకించి అగ్నిని గౌరవించడం వంటివి నొక్కి చెప్పబడ్డాయి.
  • రుడ్యార్డ్ కిప్లింగ్ యొక్క "హౌ ది రినోసరాస్ గాట్ హిస్ స్కిన్" (జస్ట్ సో స్టోరీస్) లోని ఒకే ఒక మానవుడు గల్ఫ్ అఫ్ ఎడెన్ లో నివసించే ఒక పార్సీ, ఆయన టోపీపై సూర్యకిరణాలు తూర్పు వైపు ప్రకాశం కంటే ఎక్కువగా ప్రతిబింబిస్తాయి.
  • పంచగనికి చెందిన ఒక అసాధారణ పార్సీ కుటుంబ కథ 2006 నాటి చిత్రం బీయింగ్ సైరస్ ఆంగ్ల భాషా భారతీయ చిత్రాలలో అత్యధిక వసూళ్లను చేసింది. పత్రికలూ మరియు విదేశీ చలన చిత్రోత్సవాలలో మంచి ప్రశంశలు అందుకున్నప్పటికీ, పార్సీ సమాజంలోని అనేకమంది సభ్యులచే ఈ చిత్రం తీవ్రంగా విమర్శించబడింది. 1988లో ప్రసిద్ధి చెందిన మారాఠీ రంగస్థల నటుడు Ms. విజయ మెహత ప్రముఖ బాలీవుడ్ నటులైన షబానా అజ్మి, నసీరుద్దిన్ షా మరియు అనుపమ్ ఖేర్ లతో నిర్మించిన పెస్తోంజీ కూడా ఉంది.
  • 1998 నాటి దీపా మెహతా చిత్రం ఎర్త్ (భారతదేశంలో 1947గా విడుదల చేయబడింది) ముఖ్య పాత్రధారి అయిన బాలిక భారతదేశ విభజన (మత వైరుధ్యాల వలన జరిగినది) సమయంలో పార్సీ కుటుంబానికి చెందినది. ఈ చిత్రం బాప్సి సిధ్వా రచించిన అర్ధ-చారిత్రాత్మక నవల క్రాకింగ్ ఇండియా (ప్రారంభంలో ఐస్ కేండీ మాన్ ) ఆధారంగా నిర్మించబడింది.
  • సాల్మన్ రష్డీ యొక్క నవల ది గ్రౌండ్ బినీత్ హర్ ఫీట్ పార్సీ నేపథ్యం కలిగిన, ప్రపంచ ప్రసిద్ధ భారతీయ రాక్ స్టార్ ఒర్మాస్ కామా వృద్ధి గురించి వివరిస్తుంది. అంతేకాక, రష్డీ యొక్క నవల మిడ్నైట్స్ చిల్డ్రన్ లోని రెండు చిన్నవైనప్పటికీ ప్రధాన పాత్రలైన సైరస్ దుబాష్ మరియు హోమీ కాట్రాక్, పార్సీలే.
  • మాన్ బుకర్ ప్రైజ్-ప్రతిపాదించబడిన పార్సీ రచయిత రోహిన్టన్ మిస్త్రీ యొక్క పుస్తకాలు ముఖ్యంగా పార్సీ పాత్రలు మరియు వారి చుట్టూ ఉన్న భారతీయ సమాజానికి సంబంధించిన వ్యవస్థల గురించి వ్యవహరిస్తాయి, ప్రత్యేకించి టేల్స్ ఫ్రమ్ ఫిరోజ్షా బాగ్ (1987), సచ్ ఎ లాంగ్ జర్నీ (1991), ఎ ఫైన్ బాలన్స్ (1995), మరియు ఫ్యామిలీ మాటర్స్ (2002) వంటివి.
  • జూల్స్ వెర్నె యొక్క నవల అరౌండ్ ది వరల్డ్ ఇన్ ఎయిటీ డేస్ లో, ఫిలేయాస్ ఫాగ్ మరియు పస్సెపార్టౌట్ ఒక భారతీయ మహిళా అయిన ఔదాను తన భర్త (ఒక మహారాజా) చితిపై దూకి సతి(సహగమనం) చేయకుండా కాపాడతారు. తరువాత ఆమె తాను పార్సీనని వ్యాపారి అయిన తండ్రి తనను మహారాజాకు ఇచ్చి వివాహం చేసాడని తెలుపుతుంది.
  • జాన్ ఇర్వింగ్ యొక్క 1994 నవల ఎ సన్ అఫ్ ది సర్కస్ లో, పార్సీ అయిన డాక్టర్ ఫారూక్ దారువాలా, ఒక ఆస్ట్రియన్ ను వివాహం చేసుకుంటాడు.
  • 2007 చిత్రం పర్జానియా, 2002 అహ్మదాబాద్ మతకలహాల అగ్నిజ్వాలలో చిక్కుకున్న పార్సీ కుటుంబ యథార్థగాథపై ఆధారపడింది. ఈ చిత్రానికి కథలోని ఒక పాత్ర యొక్క ఊహాజనిత లోకం పేరు పెట్టబడింది, ఈ లోకంలో ప్రతీదీ క్రికెట్ మరియు ఐస్ క్రీం చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి.
  • 2003 నాటి హిందీ చిత్రం మున్నాభాయ్ MBBSలో కురుష్ దేబూ, సంజయ్ దత్ కు వైద్యశాస్త్ర పరీక్షలలో సహాయం చేసిన డాక్టర్ రుస్తుం పావ్రి పాత్రను పోషించారు. ఈ చిత్రం రుస్తుం మరియు అతని ముసలి తండ్రిని ఒక పార్సీ నేపథ్యంలో చూపిస్తుంది.
  • బాసు ఛటర్జీ రూపొందించిన ఖట్టా మీఠ కూడా పార్సీ నేపథ్యం కలిగినదే.
  • రాయ్ అప్ప్స్ చే రచింపబడిన 'కానన్ డాయ్లే అండ్ ది ఎడల్జి కేస్', BBC రేడియో యొక్క ఒక పూర్తిస్థాయి నాటకీకరణ, 'పశువులు-చంపడం'లో నిందితుడైన ఒక పార్సీ న్యాయవాది, జార్జ్ ఎడల్జీ కథపై ఆధారపడింది.

గమనికలు

  1. Hodivala 1920, p. 88
  2. Boyce 2001, p. 148
  3. Lambton 1981, p. 205
  4. Nigosian 1993, p. 42
  5. Eliade, Couliano & Wiesner 1991, p. 254.
  6. Palsetia 2001, p. 1,n.1.
  7. Hinnells 2005, p. 6.
  8. Palsetia 2001, p. 1, n1.
  9. National Council on Family Relations (1972). Journal of marriage and family, Volume 34. National Council on Family Relations. p. 347.

సూచనలు

బాహ్య లింకులు

Media related to Parsi at Wikimedia Commons Media related to Zoroastrianism in Iran at Wikimedia Commons

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.